News July 8, 2024

నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

image

తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 15 వరకు జరగనుంది. మొత్తం 173 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 70,307 అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం గమనార్హం. పలు కాలేజీలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను పెంచేందుకు AICTE అనుమతి పొందడంతో 2, 3 విడతల కౌన్సెలింగ్ వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Similar News

News March 24, 2026

యుద్ధం.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశం

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇంధన భద్రత, పెరుగుతున్న విద్యుత్ ధరల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో 98% పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటం గమనార్హం.

News March 24, 2026

హార్ముజ్‌ను తెరిచి ఉంచడం అత్యవసరం: మోదీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు <<19466723>>కాల్<<>> వచ్చినట్లు PM మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరిచి, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.

News March 24, 2026

IPL: రహానేకు అతి తక్కువ జీతం..

image

IPL- 2026లో జీతాల పరంగా కెప్టెన్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. LSG కెప్టెన్ పంత్ ₹27 కోట్లతో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మరోవైపు KKR కెప్టెన్ అజింక్యా రహానే ₹1.5 కోట్లు మాత్రమే అందుకుంటున్నారు. ఈ సీజన్‌లో అత్యంత తక్కువ జీతం తీసుకుంటున్న సారథి ఈయనే. కాస్ట్లీ ప్లేయర్ల కంటే అనుభవానికే KKR ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ ‘లో బడ్జెట్’ కెప్టెన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.