News July 8, 2024

SI శ్రీనివాస్ ఆత్మహత్య.. గుండెపోటుతో మేనత్త మృతి

image

TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (38)మరణవార్త విని అతడి మేనత్త గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా నాచినపల్లికి చెందిన దార రాజమ్మ(65).. తన మేనల్లుడు చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయింది. సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శేఖర్, శివ, నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని తీవ్రంగా వేధించారని, కులం పేరుతో దూషించేవారని శ్రీనివాస్ మరణ వాంగ్మూలంలో తెలపడం సంచలనంగా మారింది.

Similar News

News April 4, 2026

ALERT: ఇవాళ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

News April 4, 2026

ఏప్రిల్ 6న ₹500కోట్ల ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

TG: ఈనెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ₹500కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ₹300కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో ₹200కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు.

News April 4, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.