News July 8, 2024
‘స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి’

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 26, 2026
వైద్య సేవలకు గుర్తింపు.. డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్కు పురస్కారం

ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖలో విశేష సేవలు అందించిన డీసీహెచ్ఎస్ డాక్టర్ కేసగని రాజశేఖర్ గౌడ్ను ఉత్తమ జిల్లా స్థాయి అధికారి పురస్కారం వరించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చూపిన నిబద్ధతను అధికారులు కొనియాడారు. పురస్కారం పట్ల పలువురు వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
News January 26, 2026
ఖమ్మం: జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు: కలెక్టర్ అనుదీప్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కలెక్టర్ అనుదీప్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశమిచ్చారు. సన్నవడ్లు పండించిన 39,475 రైతులకు రూ.113.57 కోట్లు బోనస్ జమ, 9.30 లక్షల గ్యాస్ సిలిండర్లకు రూ.26.31 కోట్లు సబ్సిడీ, 2,46,855 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు చేరవేశామని వెల్లడించారు.
News January 25, 2026
ఖమ్మం: రేపు జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొంటారని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ. 9:30కు కలెక్టర్ ప్రసంగం. 9:50కు సాంస్కృతిక కార్యక్రమాలు. 10:45కు ప్రశంస పత్రాల పంపిణీ అనంతరం కలెక్టర్ స్టాళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు.


