News July 8, 2024
కృష్ణా జలాశయాలు లేక రైతులు ఆందోళన

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఎకరాలకు కేఎల్ ద్వారా సాగు నీరందడంతో పాటు 300 గ్రామాలకు పైగా 500 చెరువులతో పాటు దుందుభీ నదిలో సైతం కృష్ణా జలాలతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం నెలరోజులు పూర్తైనా ఇంకా కృష్ణా జలాశయాలు డెడ్జోరేజీలో ఉండటంతో పరివాహక ప్రాంత రైతులందరూ ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 17, 2026
పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?
News March 17, 2026
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 16, 2026
పాలమూరు: SZ.. రేపు KHO-KHO ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు KHO-KHO ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 17న పురుషులకు ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని, ముఖ్య అతిథిగా వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరవుతారన్నారు. 17-25 ఏండ్ల లోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ ప్రిన్సిపల్ సంతకంతో ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్తో హాజరు కావాలన్నారు. SHARE IT


