News July 8, 2024
MDK: ఒంటరితనం భరించలేక యువతి ఆత్మహత్య
ఒంటరితనం భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్చెరు అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాధవపురి హిల్స్ కాలనీలో ఉంటున్న రీనా(30)భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వర్క్ ఫ్రం హోం డ్యూటీ చేసుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగిస్తున్న 130 మాత్రలను ఒకేసారి మింగి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 6, 2024
దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం
కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
News October 5, 2024
పిల్లల భద్రత.. మన అందరి బాధ్యత: సిద్దిపేట సీపీ
దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారే పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News October 5, 2024
కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తా: జగ్గారెడ్డి
రాహుల్ గాంధీ ఇంటి ముందు హరీశ్ రావు దీక్ష చేస్తే తాను మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ముందు చేస్తానని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. BRS పదేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో హరీశ్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో రుణమాఫీ చేసినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు.