News July 8, 2024

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఇలా

image

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఈనెల నుంచి అమలులోకి వచ్చాయి. ₹3కోట్లలోపు FDకి జనరల్ కేటగిరిలో 3-7.20%, సీనియర్ సిటిజన్లకు 3.50-7.75% వడ్డీని ICICI ఆఫర్ చేస్తోంది. 15-18 నెలల టెన్యూర్‌కు (7.20%- రెగ్యులర్‌, 7.75%- Sr) అధిక వడ్డీని ఇస్తోంది. యాక్సిస్ సైతం వడ్డీ రేట్లను పెంచింది. గరిష్ఠంగా రెగ్యులర్‌లో 7.20% (17-18 నెలలకు), వృద్ధులకు 7.75% (5-10ఏళ్లు) వడ్డీని అందిస్తోంది.

Similar News

News April 9, 2026

‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

image

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్‌(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.

News April 9, 2026

పాక్ నమ్మదగిన మీడియేటర్ కాదు: ఇజ్రాయెల్

image

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశామని పాకిస్థాన్‌ చెప్పుకుంటోంది. అయితే మీడియేటర్‌గా ఆ దేశ విశ్వసనీయతపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సందేహాలు వ్యక్తం చేశారు. పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని చెప్పారు. వాషింగ్టన్ సొంత కారణాలతో వ్యూహాత్మకంగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో హమాస్‌తో డీల్ కోసం ఖతర్, తుర్కియేను US ఎలా వాడుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

News April 9, 2026

10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

image

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It