News July 8, 2024
HYD: డ్రగ్స్ తీసుకున్న 12 మందిపై కేసు

డ్రగ్స్ తీసుకున్న 12 మందిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్థులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను కొనుగోలు చేసి సేవిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కొనడం, సేవించడం నేరమని ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
Similar News
News October 31, 2025
PHOTO OF THE DAY: దూరదర్శినితో DGP, CP

బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. డేటా సెంటర్, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్, సీపీ కార్యాలయం, హెలిప్యాడ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. CP సజ్జనార్తో కలిసి దూరదర్శిని సాయంతో నగరాన్ని వీక్షించారు. వీరి వెంట ICCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు.
News October 30, 2025
సజ్జనార్ ఆకస్మిక తనిఖీ: సాంకేతికత వాడకంపై ఆదేశం

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం బంజారాహిల్స్లోని కమిషనర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, ఐటీ, కంట్రోల్ రూమ్ సహా వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ పెట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయంపై ఆరా తీశారు. సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. విధుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు
News October 30, 2025
BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


