News July 8, 2024
ఒలింపిక్స్లో భారత పతాకధారిగా పీవీ సింధు

పారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్న భారత బృందానికి చెఫ్ దే మిషన్(మొత్తం టీమ్కు ఇన్ఛార్జ్)గా షూటర్ గగన్ నారంగ్ను IOA నియమించింది. ఈయన దేశానికి నాలుగు ఒలింపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. చెఫ్ దే మిషన్ బాధ్యతల నుంచి బాక్సర్ మేరీ కోమ్ తప్పుకోవడంతో నారంగ్కు అవకాశం వచ్చింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ వ్యవహరించనున్నారు.
Similar News
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.
News January 13, 2026
విజయ్కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.
News January 13, 2026
భోగి మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలి: CM

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.


