News July 8, 2024
సచివాలయ వ్యవస్థపై త్వరలో అధ్యయనం: మంత్రి స్వామి

AP: తమపై పనిభారం పెరిగిపోతోందని వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామిని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు కలిశారు. టెక్నికల్ స్కిల్స్ అధికంగా ఉన్న వారిని స్కూళ్లు, కాలేజీల్లో సాంకేతిక విధుల కోసం వినియోగించుకోవాలని కోరారు. సచివాలయ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందిస్తామని మంత్రి వారి విజ్ఞప్తిపై బదులిచ్చారు.
Similar News
News January 26, 2026
భీష్మాష్టమి పూజా విధానం

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.
News January 26, 2026
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
News January 26, 2026
HAM రోడ్ల పనులకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ!

TG: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(HAM)లో అభివృద్ధి చేయడానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఉంటుందని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వారికి అడ్వాన్స్ కింద 10%, వర్క్ ముగియగానే 30% బిల్లులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. మిగతా 60% పదిహేనేళ్లలో చెల్లించేలా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. తద్వారా పనులు స్పీడప్ అవుతాయని భావిస్తోంది.


