News July 9, 2024

KTDM: గుండెపోటుతో స్టాఫ్ నర్స్ మృతి

image

భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి స్టాఫ్ నర్సు పి.కల్యాణి(36) విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి 8 గంటలకు ఆమె తనకు కేటాయించిన కాన్పు వార్డుకు వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.

Similar News

News October 8, 2024

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్

image

ఖరీఫ్ 2024-25 సీజన్లో ఖమ్మం జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

News October 8, 2024

KMM: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

News October 7, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరు కొత్త కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 1 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.