News July 9, 2024
గతంలో కంటే భారీగా తగ్గిన ఇసుక ధరలు: టీడీపీ

AP: కూటమి ప్రభుత్వ విధానాలతో ఇసుక ధరలు YCP ప్రభుత్వంలో కంటే భారీగా తగ్గాయని TDP ట్వీట్ చేసింది. కేవలం రవాణా, లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే చాలని పేర్కొంది. తిరుపతిలో అన్ని ఛార్జీలు కలుపుకుని టన్నుకు రూ.590 చొప్పున 20 టన్నులకు ₹11,800 వసూలు చేసినట్లు రసీదును షేర్ చేసింది. దుర్మార్గపు జగన్ ప్రభుత్వం 20 టన్నులకు ₹50వేలు వసూలు చేసిందని దుయ్యబట్టింది. తమ నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతుందని తెలిపింది.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


