News July 9, 2024

రాంచంద్రంపురం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ మార్క్స్ నగర్‌లో ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్(40) సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాడు. అతను గంజాయికి బానిసై ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.27,500 విలువ గల 1,100 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్సీపురం పోలీసులు తెలిపారు.

Similar News

News December 29, 2025

ఘనపూర్ ఆనకట్టకు నీళ్లు రావు: ఈఈ శ్రీనివాస్ రావు

image

సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆనకట్ట (వనదుర్గ ప్రాజెక్టు) రబీ- 2025-26 ఆయకట్టుకు సంభందించి సాగునీరు విడుదల చేయబోమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ రావు సోమవారం తెలిపారు. వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, మెదక్, హవేలీఘనపూర్, పాపన్నపేట్ మండలాల్లోని ఆయకట్టు పరిధిలో గల రైతులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News December 29, 2025

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: MDK కలెక్టర్

image

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 64 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ భారతి 21, ఇందిరమ్మ ఇళ్లు 11, పెన్షన్లు 12, ఇతర అంశాలపై 20 దరఖాస్తులు ఉన్నాయి.

News December 29, 2025

మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపికలు

image

మెదక్ అథ్లెటిక్స్ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ ప్రసన్నకుమార్ రన్ ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.కె.హుస్సేన్, రెనాగుప్త ఎన్జీవోస్ ఆర్గనైజర్ మెడల్స్ అందజేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు గచ్చిబౌలిలో రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని మెదక్ జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.