News July 9, 2024

రేపు విశాఖకు కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్‌పై చిగురిస్తున్న ఆశలు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి రేపు విశాఖకు రానున్నారు. ఈ నెల 11న స్టీల్ ప్లాంట్‌లో పర్యటించి, అధికారులతో సమీక్షించనున్నారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర BJP MPలు కేంద్రమంత్రిని కోరారు. తాజాగా ఆయనే పర్యటనకు వస్తుండటంతో స్టీల్‌ప్లాంట్ కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Similar News

News October 15, 2024

రేపు బీఆర్ఎస్ కీలక భేటీ!

image

TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేపు ఉదయం 10 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారని సమాచారం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశముంది. కాగా చెరువుల సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది.

News October 15, 2024

వయనాడ్.. ప్రియాంకా గాంధీ పోటీ చేసేనా?

image

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకా గాంధీ పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో NOV 13న వయనాడ్(కేరళ) పార్లమెంట్‌కు <<14363811>>బైపోల్<<>> జరగనుండగా, ఇక్కడ ఆమె బరిలో దిగే ఛాన్స్ ఉంది. INC చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు ఆమె పోటీ చేస్తారని పలుమార్లు ప్రకటించారు. అయితే ప్రియాంక స్పందించలేదు. ఒకవేళ ఆమె పోటీ చేసి గెలిస్తే ఆ సెగ్మెంట్‌లో గెలిచిన తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.

News October 15, 2024

దీపావళి పండుగ తేదీపై వివాదం

image

AP: ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై పంచాంగకర్తల మధ్య వివాదం నెలకొంది. అక్టోబర్ 31న జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగకర్తలు, నవంబర్ 1 అసలు తేదీ అని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. రేలంగి పంచాంగాన్ని TTD అనుసరిస్తుండటంతో ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే వారు సరైన పద్ధతిలో గణించలేదని, సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకోవాలని ధృక్ పంచాంగకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.