News July 9, 2024
లగ్జరీ బ్రాండ్స్ తయారీ-అమ్మకానికి మధ్య ఇంత వ్యత్యాసమా?

ఇటలీలో లగ్జరీ బ్రాండ్లపై జరిపిన దర్యాప్తులో అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. దర్యాప్తులో Dior కంపెనీ ఒక్క హ్యాండ్బ్యాగ్కు తయారీదారులకు 53 యూరోలు (రూ.4700) చెల్లిస్తూ తన స్టోర్లో 2600 యూరోలకు (రూ.2.34 లక్షలు) అమ్ముతున్నట్లు తేలింది. అర్మానీ సంస్థ కూడా హ్యాండ్బ్యాగ్లను 93 యూరోలకు (రూ.8385) కొని 250 యూరోలకు (రూ. 22,540) విక్రయిస్తోంది. ఈ వ్యత్యాసం చూసి అధికారులే షాక్ అయ్యారట.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<