News July 9, 2024
నంద్యాల: రైతు బజార్లలో కంది పప్పు, బియ్యం కౌంటర్లు

నిత్యావసర సరుకులైన కంది పప్పు, బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయించాలని అధికారులను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రైస్ మిల్లర్లతో ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కందిపప్పు రూ. 160, సోనా మసూరి బియ్యం(ఫైన్) రూ.49, మసూరి బియ్యం(RAW) రూ.48గా నిర్ణయించినట్లు తెలిపారు.
Similar News
News March 10, 2026
కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్

పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో రూ.4,000 చెల్లించగా, చివరి విడతగా మరో రూ.2,000 నేరుగా రైతుల ఖాతాల్లో (DBT ద్వారా) జమ కానున్నాయన్నారు. నిధులు సజావుగా అందాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయాలి, భూ రికార్డులు ఆధార్తో అనుసంధానమవాలన్నారు.
News March 10, 2026
కర్నూలులో KGBVలలో అడ్మిషన్లు ప్రారంభం

కేజీవీబీలో పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ లోకరాజు తెలిపారు. జిల్లాలోని 26 పాఠశాలల్లో ప్రతి తరగతికి 40 సీట్లు ఉండగా, ఇతర తరగతుల్లో ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. SC, ST, BC, మైనారిటీ, BPL, అనాథలు, డ్రాప్అవుట్ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏప్రిల్ 1 చివరి తేది అన్నారు.
News March 10, 2026
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలను తనిఖీ చేయాలి: జేసీ

కలెక్టరేట్ నుంచి జేసీ నూరుల్ ఖమర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, రెవెన్యూ, ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సమీక్షించిన జేసీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలకు సూచించారు.


