News July 9, 2024
నిజామాబాద్లో రూ.43లక్షల గుట్కా పట్టివేత

నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం భారీగా గుట్కాను పట్టుకున్నారు. నగరంలోని మార్కెట్లోని వెల్కమ్ ఏజెన్సీ సంబంధించిన అబ్దుల్ బాసిత్ గోడౌన్లో రూ.4,26,873 గుట్కాను పట్టుకున్నట్లు SHO విజయ్ బాబు తెలిపారు. దాంతో పాటు ఈరోజు ఉదయం డిచ్పల్లిలోని మెంట్రాజ్పల్లి సమీపంలో డీసీఎంలో తరలిస్తున్న రూ.39లక్షల విలువైన గుట్కాను ఎస్ఐ మహేశ్ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 13, 2026
భీమ్గల్: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం!

భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, పట్టణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
News February 13, 2026
భీమ్గల్ 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ గెలుపు

భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
News February 13, 2026
NZB: కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు.


