News July 10, 2024

నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: జీవీఎంసీ కమిషనర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపధ్యంలో నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్‌తో కలిసి కోస్టల్ బ్యాటరీ ఏరియా నుంచి ఆర్కే బీచ్ వరకు మంగళవారం పర్యటించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News January 18, 2026

విశాఖ పోర్టుకు మరో రికార్డు

image

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.

News January 18, 2026

విశాఖ: మాస్టర్ ప్లాన్ మార్చిలోనే..!

image

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.

News January 18, 2026

సింహాచలం: సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం నేడే

image

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం వైభవంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామిని మెట్ల మార్గం గుండా కొండ దిగువ గల వరాహ పుష్కరణి వద్దకు తీసుకొస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.