News July 10, 2024

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన ఖాదర్ బాషా

image

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్గా ప్రాంగణంలో జరుగుతున్న పనులను బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ సమీ, సాబీర్ ఖాన్ తదితర నేతలు మంగళవారం పరిశీలించారు. రొట్టెల పండగకు సుమారు పది లక్షల పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో వారికి మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News November 2, 2025

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

image

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.

News November 2, 2025

NLR: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

image

నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.