News July 10, 2024

HYD: కాంగ్రెస్ ప్రభుత్వానికి KTR Request

image

HYD శివారులోని కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణ పనులు కొనసాగించాలని KTR తెలంగాణ CMOని కోరారు. 125 ఎకరాల్లో అద్భుతమైన ఎకో పార్క్‌ ప్రాజెక్టును 2022 అక్టోబర్‌లో ప్రారంభించామన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న చివరిరోజు వరకు పనులు కొనసాగించామన్నారు. కానీ, గత 7 నెలలుగా ప్రాజెక్టు ముందుకు కదలలేదని‌ పేర్కొన్నారు. నగరవాసులకు అహ్లాదాన్ని పంచే‌ పార్క్‌ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Similar News

News September 24, 2024

HYD: ఇకపై అన్నింటికీ ఒకే డిజిటల్ కార్డు

image

రాష్ట్రంలో రేషన్, ఆరోగ్యం, ఇతర సంక్షేమాలన్నింటికీ ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఈ కార్డు రూపొందించనున్నారు. సమగ్ర కుటుంబ వివరాల నమోదుపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.

News September 24, 2024

RR: జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం

image

RR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.

News September 23, 2024

గచ్చిబౌలి: సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే

image

గచ్చిబౌలి పరిధిలోని T-HUBలో సెప్టెంబర్ 27న ఇండియా ఇంటర్నెట్ డే వేడుకలు నిర్వహిస్తామని కార్య నిర్వాహకులు తెలిపారు. AI, డిజిటల్ విధానం, ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.