News July 11, 2024

వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుండి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డిసెంబర్ లోపు సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

Similar News

News October 15, 2024

కంచెలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వొద్దు: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కంచెలను విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రైతులకు సూచించారు. జిల్లాలో పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా రైతులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రమాద హెచ్చరికలను గుర్తించకుండా కేవలం పంటచేలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 15, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✒GDWL:ప్రజావాణిలో పురుగు మందు తాగిన రైతు
✒బిజినేపల్లి: కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
✒21 నుంచి SA-1 పరీక్షలు: DEOలు
✒దసరా EFFECT.. మద్యం అమ్మకాల్లో 80.14 కోట్ల ఆదాయం
✒ప్రజావాణి.. సమస్యలపై దృష్టి పెట్టండి: కలెక్టర్లు
✒జూరాలకు జలాశయానికి పెరిగిన వరద
✒ప్రయాణికులతో కిక్కిరిసి పోయిన ఆర్టీసీ బస్టాండ్లు
✒రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం

News October 14, 2024

MBNR: దసరాకు ఫుల్లుగా దావత్.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి జిల్లాల్లో 230 మద్యం దుకాణాలు ఉండగా..రూ.80.14 కోట్ల విక్రయాలు జరిగాయి. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచుతుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభిస్తుంది. పండగకు సొంతూరు వచ్చిన బంధువులు, మిత్రులతో కలిసి జోరుగా దావత్లు చేసుకున్నారు. బీరు, విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి.