News July 11, 2024
NZB నుంచి HYD వెళ్తున్న బస్సులో చోరీ
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.
Similar News
News February 8, 2025
కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడి గల్లంతు
కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
News February 8, 2025
NZB: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే: జీవన్ రెడ్డి
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీసు శాఖ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి జాతకాలు పింక్ బుక్లో ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారన్నారు.
News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.