News July 11, 2024
ఆదిలాబాద్ జిల్లాలో 15 పాఠశాలలు మూత

ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 15 పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ తర్వాత మూతబడ్డాయి. జిల్లాలోని 12 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లో అత్యల్పంగా 10 మంది విద్యార్థులు ఉంటే.. అత్యధికంగా 50 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. మరో వైపు 80 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించాల్సిందే.
Similar News
News February 25, 2026
FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.
News February 25, 2026
ADB: మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా దీర్ఘకాలిక కేసుల నుంచి విముక్తి పొందవచ్చని, మార్చి 28న జరిగే అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.
News February 25, 2026
ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.


