News July 11, 2024
విశాఖ: ఎంతైనా టీచరమ్మే కదా..!

గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్ర హోం మంత్రి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం నిత్యం చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా పాఠశాల చిన్నారులు కనిపిస్తే చాలు కొద్దిసేపు వారితో గడుపుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఒక వైపు పర్యవేక్షిస్తూనే మరోవైపు దార్లపూడిలో ప్రభుత్వ పాఠశాల చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
Similar News
News January 17, 2026
KGHలో ఆన్లైన్ వైద్య సేవలు

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.
News January 17, 2026
విశాఖ: రాజు గారి ఆవేదన వెనుక కారణం ఇదేనా?

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
News January 16, 2026
విశాఖ: 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 2 రోజులుగా విశాఖలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు,ర వాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 26 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.52,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు.


