News July 11, 2024
ఐఐటీయన్లకు భారీగా తగ్గిన ప్యాకేజీలు!

ఐఐటీయన్ల వేతనాల్లో భారీ కోత పడుతోందని డెలాయిట్, టీమ్లీజ్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది. ఒకప్పుడు ఏడాదికి సగటున రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్న ప్యాకేజీ ఇప్పుడు రూ.15 లక్షలు దాటడమే కష్టంగా మారింది. IITల్లో చదివిన వారిలో దాదాపు 40% మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు దక్కట్లేదట. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, IT కాదని ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల్లో పెట్టుబడులు కారణమని తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.
News January 16, 2026
జనవరి 16: చరిత్రలో ఈ రోజు

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం
News January 16, 2026
జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.


