News July 11, 2024

ఏఐ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్

image

భారత్ టెక్ రంగంలో 2-3 ఏళ్లలో ఏఐపై పట్టున్న ఇంజినీర్ల అవసరం ఉందంటున్నారు నిపుణులు. పది లక్షలకుపైగా ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. AI, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రాణించాలంటే ఇప్పుడున్న ఉద్యోగుల్లో సగం మందిపైన తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇందుకు తగినట్టు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడం వంటి చర్యలు చేపట్టకుంటే డిమాండ్‌ను అందుకోవడం కష్టమని తెలిపారు.

Similar News

News December 27, 2025

మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

image

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.

News December 27, 2025

ఉపవాసంలో ఉపశమనం కోసం..

image

ఉపవాస సమయంలో అలసట రాకుండా ఉండాలంటే సగ్గుబియ్యం, పన్నీర్ వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధమైన శక్తిని ఇస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. తక్కువ ఉప్పు, తక్కువ నూనెతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఇటువంటి మితమైన, పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శక్తి కోల్పోకుండా ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు.

News December 27, 2025

RBI‌లో 93 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఆర్బీఐలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ నిపుణులకు గుడ్ న్యూస్. <>RBI<<>> 93పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్‌డీ, సీఏ, సీఏంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in/