News July 11, 2024

HYD: బోనాలు, మొహర్రం ఊరేగింపు కోసం కర్ణాటక ఏనుగు

image

రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండగ సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును రప్పించనున్నారు. కర్ణాటక దావణగెరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఊరేగింపు కోసం తెలంగాణకు ఏనుగు(రూపవతి)ని తరలించేందుకు అక్కడి శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏనుగు కోసం మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

Similar News

News February 27, 2026

HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

image

​శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.

News February 27, 2026

HYD: జరిగింది సరే.. ఎవరు బాధ్యత వహిస్తారు..?

image

​దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లలో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?

News February 27, 2026

HYD: రూల్స్‌ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

image

హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం <<19251869>>రూ.450 కోట్ల<<>> వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.