News July 11, 2024

కెప్టెన్సీకి హసరంగ గుడ్ బై

image

టీ20 కెప్టెన్సీ నుంచి శ్రీలంక సారథి వనిందు హసరంగ తప్పుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శన చేయడంతోనే ఆయన తన కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో సిరీస్‌కు ముందు ఆయన తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది హసరంగ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు పది మ్యాచులకు ఈ ఆల్‌రౌండర్ సారథిగా వ్యవహరించారు.

Similar News

News July 4, 2025

కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

News July 4, 2025

IIIT విద్యార్థుల జాబితా విడుదల

image

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్‌ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. <>లింక్<<>> ఇదే.

News July 4, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో 2025 డీఏ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55శాతం డీఏను 59శాతానికి పెంచుతారని తెలుస్తోంది. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం 2026 జనవరి 1 తర్వాతే చెల్లిస్తారని సమాచారం. రానున్న 2 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.