News July 11, 2024
ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ

అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS <<13605832>>పూజా<<>> ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Similar News
News March 28, 2026
మలబద్ధకమా? ఈ టిప్స్ మీ కోసమే

వైద్యపరంగా వారానికి మూడు కంటే తక్కువసార్లు విసర్జన అవుతుంటే దాన్ని మలబద్ధకంగా భావిస్తారు. ఎక్కువ రోజులు ఈ సమస్య ఉంటే పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, అవిసె గింజలు, సబ్జా, యోగర్ట్ వంటి పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు 8-10 గ్లాసుల నీరు తాగాలి. రోజూ ఒకే సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
Share It
News March 28, 2026
టార్గెట్ 300.. ఏ టీమ్ కొడుతుందో?

కొన్నేళ్లుగా IPL టీమ్లను ఊరిస్తున్న స్కోర్ 300. ఈసారి ఆ స్కోర్ గ్యారంటీ అంటూ SRH కెప్టెన్ ఇషాన్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే జట్టులో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, లివింగ్స్టోన్ వంటి హిట్టర్లున్నారు. IPLలో టాప్ 5 హయ్యెస్ట్ స్కోర్ల(287/3, 286/6, 278/3, 277/3, 272/7)లో తొలి 4 SRHవే. మిగతా జట్లలోనూ భీకర బ్యాటర్లున్నారు. మరి ఈ సీజన్లో 300ను ఏ జట్టు కొట్టగలదో కామెంట్ చేయండి.
News March 28, 2026
H-1B ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపు!

USలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల వేతనాలను పెంచుతూ లేబర్ డిపార్ట్మెంట్ కొత్త ప్రతిపాదనలు చేసింది. H-1B, E-3 వంటి వీసాదారులకు ఇచ్చే మినిమం శాలరీ పెరగనుంది. దీనివల్ల ఏటా ఒక్కో ఉద్యోగికి ₹13 లక్షల అదనపు లబ్ధి చేకూరనుంది. విదేశీయులకు తక్కువ జీతాలిచ్చి స్వదేశీయులను తొలగించకుండా ఉండేందుకే 20 ఏళ్ల పాత వేతన విధానాన్ని మారుస్తున్నారు. వీటిపై అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తారు.


