News July 11, 2024
రాష్ట్ర ప్రగతి కోసం పార్లమెంటులో చర్చించండి: ఎంపీలకు పవన్ సూచన

AP: జనసేన MPలు, MLAలు ప్రతి నెలా ఓ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించాలని MPలకు సూచించారు. NDA, జనసేన పక్షాన మాట్లాడాలని, టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని తెలిపారు. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కాకుండా 10 మంది కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు.
Similar News
News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్ను సీఎం ప్రారంభించారు.
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <
News January 16, 2026
ఆయుధం పట్టకుండా జ్ఞాన యుద్ధం చేసిన విదురుడు

మహాభారతంలో విదురుడు ఆయుధం పట్టకుండానే జ్ఞాన యుద్ధం చేశారు. కత్తి కంటేమాట పదునైనదని నమ్మి, తన వాక్చాతుర్యంతో కురువంశాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. ధృతరాష్ట్రుడి అంధకార బుద్ధికి దిక్సూచిగా ఉంటూ, దుర్యోధనుడి దురాలోచనలను ముందే పసిగట్టి హెచ్చరించారు. ధర్మం వైపు నిలబడి ఆయన చేసిన ప్రతి సూచన అహంకారంపై సాగిన భీకర పోరాటం. దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద గెలుపును విదురుని జీవితం మనకు చెబుతుంది.


