News July 12, 2024

శ్రీవారి ఆరాధనకు మూలం అదే: రాఘవ దీక్షితులు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆరాధనకు శ్రీవైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమే మూలమని వైఖానస ట్రస్ట్ అధ్యక్షుడు రాఘవ దీక్షితులు తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, శ్రీమరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాఘవ దీక్షితులు మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు శ్రీవైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు.

Similar News

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 2, 2026

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

image

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News January 2, 2026

చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

image

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి