News July 12, 2024

భీమవరంలో రిటైర్డ్ జవాన్‌కు ఘన స్వాగతం

image

దేశానికి విశేష సేవలు అందించి రిటైర్డ్ అయ్యి భీమవరం తిరిగి వచ్చిన జావాన్ దాసరి దుర్గా రమేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవాన్ రమేశ్ MRO కార్యాలయంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పించారు. 2001 నుంచి 2024 వరకు జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ బార్డర్‌లో ఎన్‌సీవో హెడ్‌గా దేశ రక్షణలో సేవలందించిన ఆయన.. తిరిగి భీమవరం చేరుకున్నారు.

Similar News

News September 15, 2025

ఆకివీడు తహశీల్దార్ నియామకంలో గందరగోళం!

image

ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. MLA ఆదేశాలతోనే తొలుత ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారంటూ YCP శ్రేణులు ఆర్డర్ కాపీలను ట్రోల్ చేస్తున్నాయి.

News September 15, 2025

పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

image

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

News September 15, 2025

భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

image

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.