News July 12, 2024
విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి నియమితులయ్యారు. విశాఖ రేంజ్ పరిధిలో చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా పనిచేశారు. 2015లో తిరుపతి అర్బన్ ఎస్పీగా, అనంతరం కర్నూల్ ఎస్పీగా 2018 వరకు పనిచేశారు. అనంతరం తిరుపతి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2022 వరకు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి పొందారు.
Similar News
News January 17, 2026
KGHలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్మెంట్కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్ను ఆదేశించారు.
News January 17, 2026
KGHలో ఆన్లైన్ వైద్య సేవలు

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.
News January 17, 2026
విశాఖ: రాజు గారి ఆవేదన వెనుక కారణం ఇదేనా?

విశాఖ MLA విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వీటి వెనుక రాజకీయాలకన్నా టిడ్కో ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల అంశమే ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిల్లుల రూపంలో విష్ణు కుటుంబానికి సుమారు రూ.120 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం టిడ్కో బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.


