News July 12, 2024
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరు తొలగింపు

AP: గృహ నిర్మాణ పథకానికి గత YCP ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పేరును కూటమి సర్కార్ తొలగించింది. పూర్తైన ఇళ్లకు సంబంధించి పాస్ పుస్తకాలు, సర్టిఫికెట్లపై జగన్ బొమ్మలు, YCP రంగులు వేయొద్దని, స్వాగత ద్వారాలపై పేర్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పేర్లు కొనసాగించాలంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కుని వన్టైమ్ సెటిల్మెంట్ పథకంగా మార్చింది.
Similar News
News January 29, 2026
పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మహర్దశ

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను బోధనా ఆసుపత్రిగా ఉపయోగించుకునే విధంగా వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ఆమోదించింది. పిడుగురాళ్ల ఆసుపత్రిని ప్రస్తుత 330 పడకల ఆసుపత్రి నుంచి 420 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి 600 పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
News January 29, 2026
మంజూరైన ఇళ్లన్నీ ఉగాదికి సిద్ధం చేయాలి: VZM కలెక్టర్

ఉగాది నాటికి మంజూరైన గృహాలన్నింటినీ పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మండలాల వారీగా వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం పురోగతిపై సమీక్ష జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.
News January 29, 2026
మంజూరైన ఇళ్లన్నీ ఉగాదికి సిద్ధం చేయాలి: VZM కలెక్టర్

ఉగాది నాటికి మంజూరైన గృహాలన్నింటినీ పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మండలాల వారీగా వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం పురోగతిపై సమీక్ష జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.


