News July 12, 2024
జైపూర్: ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

జైపూర్ మండలం మిట్టపల్లిలోని కొమ్ముగూడెనికి చెందిన డిగ్రీ విద్యార్థిని సెగ్యం భాగ్యలక్ష్మి (18) గ్రామ సమీపంలోని మామిడి తోటలో గురువారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సెగ్యం రమేశ్-శ్రీలత దంపతుల కూతురుభాగ్యలక్ష్మి జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 2, 2026
ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: కలెక్టరేట్లో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.


