News July 12, 2024
మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
వర్షపు నీటిని ఒడిసి పడదాం: ఎంపీ పెమ్మసాని

వర్షపు నీటిని ఒడిసి పట్టి.. జీవనాధారం పెంచుదామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్పై రెండ్రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. పెమ్మసాని మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, సీఎం చంద్రబాబు మంచి విజన్తో ఆ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.


