News July 12, 2024
చీకటి అధ్యాయంగా ‘ఎమర్జెన్సీ’ గుర్తుండిపోతుంది: మోదీ

కాంగ్రెస్ ‘ఎమర్జెన్సీ’ నిర్ణయాన్ని యావత్ దేశం ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్’గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ‘ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాసి తర్వాత దేశం ఎదుర్కొన్న పరిస్థితులను ఈరోజు గుర్తుకుతెస్తుంది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతివ్యక్తికి నివాళులర్పించే రోజు జూన్ 25’ అని ఆయన రాసుకొచ్చారు.
Similar News
News November 4, 2025
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.
News November 4, 2025
రబ్బర్ బోర్డ్లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<


