News July 12, 2024

విజయవాడ: TODAY HEADLINES

image

*YS జగన్‌పై కేసు నమోదు.!
*వల్లభనేని వంశీకి అరెస్ట్ గండం?
*గన్నవరం విమానాశ్రయాన్ని నం.1 చేస్తాం: ఎంపీ చిన్నీ
*ఉండవల్లిలో కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన చంద్రబాబు
*జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తా: MP బాలశౌరి
* నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం.. VRO మృతి
*చంద్రబాబు తన మార్క్ చూపించారు: దేవినేని ఉమా

Similar News

News January 23, 2026

కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

image

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.

News January 23, 2026

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని, దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకున్న నాడే సమసమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులచే ‘నా దేశం-నా ఓటు’ నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.

News January 23, 2026

నందమూరులో మూడో రోజు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్

image

నందమూరులోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం సెషన్‌లో 180 మందికి గాను 172 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెషన్‌లో 180 మందికి గాను 174 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, ఆరుగురు హాజరు కాలేదని కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.