News July 13, 2024

ఆ వర్సిటీలో 94 ఏళ్లలో తొలిసారిగా మాంసాహారం

image

కేరళలోని కళామండలం యూనివర్సిటీలో 94 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా క్యాంటీన్‌లో మాంసాహారాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. సంస్థ మొదలైనప్పటి నుంచి శాకాహారమే ఇక్కడ అందుబాటులో ఉండేది. నాన్ వెజ్ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తుండటంతో తాజాగా చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసింది. దాన్ని త్రిస్సూర్‌లోని వియ్యూర్ జైలు ఖైదీలు తయారుచేయడం విశేషం. 1930లో ప్రారంభమైన కళామండలం గురుకుల వ్యవస్థలో నడుస్తోంది.

Similar News

News March 30, 2026

రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు

image

AP: విశాఖ LVనగర్‌లో దారుణం జరిగింది. నేవీ టెక్నీషియన్‌ రవీంద్ర(35) ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. ఇటీవల అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలు మౌనిక(29)ను ఆదివారం రాత్రి ఫ్లాట్‌కు పిలిచాడు. తర్వాత ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అనంతరం PSలో లొంగిపోయాడు. అతడి సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 30, 2026

త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ: దామోదర

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 9,572 పోస్టులు భర్తీ చేశామని, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. త్వరలో వైద్య శాఖలో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికీ వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో 9.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించినట్లు వివరించారు.

News March 30, 2026

నలభై తర్వాత ఇవి తీసుకోండి

image

మెనోపాజ్ తర్వాత మహిళలు బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే సబ్జా గింజలు, సిట్రస్ పండ్లు, కోడిగుడ్లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సరైన పోషకాలు అందడం వల్ల శారీరక మార్పులను తట్టుకుని ఆరోగ్యంగా జీవించడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. దీంతో పాటు నలభై దాటాక కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామంపై కూడా దృష్టి సారించాలని చెబుతున్నారు.