News July 13, 2024
వైసీపీ దోపిడీపై కచ్చితమైన లెక్కలు తీయండి: CM చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలు, సహజ వనరుల దోపిడీపై కచ్చితమైన లెక్కలు తీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహజవనరుల దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు రూపొందించిన నివేదిక పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి పూర్తి వివరాలతో రావాలని, ఏ ఒక్క అంశాన్ని వదలొద్దని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
Similar News
News January 1, 2026
X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 1, 2026
నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.
News January 1, 2026
బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సజీవ దహనానికి యత్నం

బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా షరియత్పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే హిందువుపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. డిసెంబర్ 31న ఇంటికి వెళ్తున్న అతడిపై కత్తులతో అటాక్ చేసి తీవ్రంగా కొట్టి ఆపై నిప్పు పెట్టారు. దగ్గర్లో ఉన్న చెరువులోకి దూకి అతడు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృత్ మండల్, దీపూ దాస్ వంటి వారూ ఇలాంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.


