News July 13, 2024
జన్నారంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

జన్నారం మండలం టీజీపల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు నుంచి ఉట్నూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2025
ADB: కామదహనం ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్న ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు చేసుకుంటారు. వాటిని వెదురుతో అంటించిన మంటల్లో పెట్టి పోటీలు నిర్వహిస్తారు.
News March 13, 2025
ఆదిలాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 13, 2025
ఇంద్రవెల్లి: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.