News July 13, 2024

7సార్లు కాటు.. పాములు పగబడతాయా?(2/2)

image

పాము పగపై శాస్త్రీయంగా అధ్యయనాలేవీ జరగలేదు. నిజంగా పగలాంటిది ఉంటే సర్పాలు విరివిగా ఉండే భారత్‌లో ఇప్పటికే నిరూపణ అయి ఉండేదంటున్నారు జంతునిపుణులు. బహుశా బాధితుడిని తొలి పాము కాటేసినప్పుడు దాని తాలూకు ఆనవాలు ఏదైనా అతడిపై ఉండిపోయిందా..? దాన్ని పసిగట్టిన ఇతర పాములు అతడిని వెంబడిస్తున్నాయా? ఈ దిశగానూ ఆలోచించాలంటున్నారు నిపుణులు. మరి ‘పాముపగ’పై మీకు తెలిసిన ఘటనలేమైనా ఉన్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News November 13, 2025

కాపర్ టీ వాడుతున్నారా?

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్‌ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.

News November 13, 2025

అదానీ కోసమే భూటాన్‌కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

image

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్‌లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్‌కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్‌పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్‌లో ఫొటో ట్యాగ్ చేశారు.

News November 13, 2025

ఈ సమయంలో వరిని ఆశించే తెగుళ్లు – నివారణకు సూచనలు

image

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో మెడవిరుపు, గింజ మచ్చ తెగులు, సుడిదోమ, కంకినల్లి ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరిలో మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే 200 లీటర్ల నీటిలో ఐసోప్రోథియోలేన్ 300ml లేదా కాసుగామైసిన్ 500ml కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. గింజమచ్చ, కంకినల్లిని గమనిస్తే స్పైరోమెసిఫెన్ 1ml+ ప్రొపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.