News July 13, 2024
NLG: ఉమ్మడి జిల్లాకు త్వరలో కొత్త బస్సులు!

ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో త్వరలో కొత్త మార్గాలకు 30 బస్సులు, పాత మార్గాల్లో అదనంగా మరో 30 బస్సులతో పాటు నల్గొండ, సూర్యాపేట పరిధిలో మరో 50 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 640 బస్సులు ఉండగా.. నిత్యం 2.50 లక్షల KM తిరుగుతూ సుమారు రూ.150కోట్ల ఆదాయం వస్తుంది.
Similar News
News September 14, 2025
నల్గొండ: 26,692 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. శనివారం ఒక్క రోజే 26,692 కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ అదాలత్లో 71 సివిల్, 15,921 క్రిమినల్, 96 మోటార్ వాహన ప్రమాద బీమా, 50 బ్యాంక్, 73 సైబర్ క్రైమ్, 35 ట్రాన్స్కో, 10,446 ట్రాఫిక్ చలాన్ కేసులు రాజీ కుదిరి పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 14, 2025
NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.
News September 14, 2025
నకిరేకల్లో టీచర్పై పోక్సో కేసు నమోదు

నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్పై పోక్సో కేసు నమోదైంది. పదో తరగతి విద్యార్థినిని మూడు నెలలుగా వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నకిరేకల్ పోలీసులు ఆరోపణలు నిర్ధారించుకుని ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.