News July 13, 2024

YCP చేసిన తప్పులు మనం చేయొద్దు: CM చంద్రబాబు

image

AP: ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ, కమిటీలు ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘పవర్‌లోకి వచ్చేశామనే అలసత్వం వీడాలి. రోజూ ఇద్దరు మంత్రులు పార్టీ ఆఫీసులో ప్రజల వినతులు స్వీకరించాలి. నేతలెవరూ కక్షసాధింపులకు దిగొద్దు. YCP చేసిన తప్పులే మనం చేస్తే వారికి మనకు తేడా ఉండదు. కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల నుంచి చట్టపరంగా విముక్తి కలిగిద్దాం’ అని ముఖ్య నేతలతో సమావేశంలో CBN అన్నారు.

Similar News

News November 5, 2025

నవంబర్ 10-19 వరకు సమ్మేటివ్ పరీక్షలు

image

AP: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో నిర్వహించే సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతులకు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, 6, 7 క్లాసులకు మ.1.15 నుంచి సా.4.15 వరకు జరుగుతాయి. 8-10 తరగతులకు ఉ.9.15 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా తరగతుల పరీక్ష పేపర్ల నమూనా వివరాలను షెడ్యూల్‌లో పొందుపరిచింది.

News November 5, 2025

కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: కిషన్ రెడ్డి

image

TG: కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్‌ను PM మోదీ ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలంటూ సీఎం రేవంత్ చేసిన <<18200152>>వ్యాఖ్యలకు<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. తాము ఎవరినీ జైలులో వేయమని, కోర్టులు వేస్తాయని తెలిపారు. KCRను జైలులో వేస్తామని తాము చెప్పలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం NDSA నివేదికపై మాత్రమే సీబీఐ విచారణ కోరింది. గవర్నర్ తన అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.

News November 5, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.