News July 13, 2024
అమర జవాన్ భార్యపై అసభ్యకర కామెంట్.. నెటిజన్పై కేసు

అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకర <<13592580>>కామెంట్<<>> చేసిన నెటిజన్పై కేసు నమోదైంది. అన్షుమాన్ సేవలకుగానూ ఇటీవల ఆయన భార్య స్మృతికి కేంద్రం ‘కీర్తిచక్ర’ అవార్డు ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఓ నెటిజన్ ఆమెపై అసభ్యకర కామెంట్ చేశాడు. దీన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News March 31, 2026
మాడిపోతున్న వేప చెట్లు.. కారణం, నివారణ ఇలా!

ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లకు పెద్ద కష్టం వచ్చింది. AP, TGలో వేలాది చెట్లు ఎండిపోతున్నాయి. దీనికి ‘డైబ్యాక్’ అనే వ్యాధి కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఆకులపై కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలని, చెట్టు మొదలులో వర్మీ కంపోస్ట్ వేయాలని సూచిస్తున్నారు. చెట్లను కాపాడటానికి అధికారులే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
* మీ ఏరియాలోనూ వేప చెట్లకు ఇలా అవుతోందా?
#ShareIt
News March 31, 2026
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల శాతం 70గా ఉండగా దానిని 50%కు తగ్గిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది.
News March 31, 2026
యుద్ధం.. భారీగా పెరగనున్న ధరలు

పశ్చిమాసియా యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. AP, TGలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. వారంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బస్తా రూ.280-320 మధ్య ఉండగా పెంపు తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు వాడే పెట్రోలియం కోక్ 130 డాలర్ల నుంచి 165కు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్ రూ.23.75 పెంచడం ధరల పెరుగుదలకు కారణం.


