News July 13, 2024
గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు: 71 మంది మృతి

గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దీంతో 71 మంది సాధారణ ప్రజలు మరణించగా 289 మంది గాయాలపాలయ్యారు. కాగా ఖాన్ యూనిస్ ప్రాంతంలోనే హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని, అందుకే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇప్పటివరకు గాజా నరమేధంలో 38,300 మంది మరణించారు. 88,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాజాలోని 80 శాతం ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


