News July 13, 2024
ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు: జనసేన

AP: ఈ నెల 18 నుంచి 28 వరకు 4వ విడత సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో ఈ మహా యజ్ఞం చేపట్టినట్లు పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ నిలిచిందని గుర్తు చేశారు. అదే ఉత్సాహంతో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేసే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు.
Similar News
News September 15, 2025
వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

జపాన్లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
News September 15, 2025
రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించండి: తుమ్మల

TG: రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రజత్ కుమార్ తెలిపారు.
News September 15, 2025
కేటీఆర్లా బెదిరింపు దావాలు వేయను: బండి

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.