News July 14, 2024
నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్రథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19 వరకు దేవతా మూర్తులు ఆలయం బయటే ఉండనున్నాయి. ఈ కారణంగానే లెక్కింపు వివరాల్ని వెల్లడించనట్లు తెలుస్తోంది.
Similar News
News January 16, 2026
జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తును సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తుల విచారణ చట్టం 1965 ప్రకారం ఉమ్మడి కమిటీ తప్పనిసరి అనే ఆయన వాదనను తోసిపుచ్చింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తదుపరి చర్యలు చేపట్టడానికి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. 2025 మార్చిలో యశ్వంత్ నివాసంలో భారీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.
News January 16, 2026
తప్పిన యుద్ధ గండం: అరబ్ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గిన ట్రంప్!

ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నిరసనకారులపై కాల్పులు, ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల ‘మధ్యరాత్రి దౌత్యం’ పనిచేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ శాంతించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి యుద్ధ భయాలు తొలగినట్లే!
News January 16, 2026
సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

AP: గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం గ్లోబల్ హబ్గా మారనుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకూ సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వల్ల 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్ కోసం వేచి ఉండండి అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారీ పెట్టుబడుల ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.


