News July 14, 2024

8 ఏళ్ల బాలికపై హత్యాచారం.. మళ్లీ మాట మార్చిన మైనర్లు!

image

AP: ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలిక <<13600394>>హత్యాచారం<<>> కేసులో మైనర్లు తరచూ మాట మారుస్తున్నారు. బాలిక మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని నిన్న చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఓసారి ఎత్తిపోతల కాలువలో పడేశామని, మరోసారి శ్మశానంలో పూడ్చిపెట్టామని గతంలో చెప్పారు. అక్కడ వెతకగా మృతదేహం జాడ కనిపించలేదు. దీంతో వారి తల్లిదండ్రులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 4, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

image

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

వరల్డ్‌కప్ విజేతలు విక్టరీ పరేడ్‌కు దూరం

image

ICC ఉమెన్స్ వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్‌‌కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్‌లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ర్యాలీ చేపట్టడం లేదని చెబుతున్నారు. రేపు ఢిల్లీలో PM చేతుల మీదుగా టీమ్‌ ఇండియాను సన్మానిస్తారు. తొలిసారి ఉమెన్ వరల్డ్‌కప్ గెలిచినా పరేడ్ లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి.