News July 14, 2024

‘కన్నప్ప’ నుంచి శరత్ కుమార్ లుక్ రివీల్

image

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీ నుంచి శరత్ కుమార్ లుక్ రివీలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ‘నాథనాథుడు’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముకేశ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందిస్తున్నారు.

Similar News

News July 6, 2025

ఇంజినీరింగ్.. ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు?

image

TG: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుండగా <<16970142>>సీట్ల<<>> వివరాలను అధికారులు వెల్లడించారు. కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా CSEలో 26,150 సీట్లు, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 12,495 సీట్లు, ECEలో 10,125, CSE డేటా సైన్స్‌లో 6,996, EEEలో 4,301, ITలో 3,681, సివిల్ ఇంజినీరింగ్‌లో 3,129, మెకానికల్‌లో 2,994 సీట్లు ఉన్నాయి.

News July 6, 2025

విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

image

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్‌పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.

News July 6, 2025

మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

image

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.