News July 14, 2024
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. ఓ T20 సిరీస్లో సెంచరీతోపాటు వికెట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు భారత్ నుంచి మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. కాగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్కు బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్లో మాత్రం 3 ఓవర్ వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.
Similar News
News December 30, 2025
టుడే టాప్ స్టోరీస్

*అసెంబ్లీలో కేసీఆర్ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి
News December 30, 2025
గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.
News December 30, 2025
హైదరాబాద్లో కొత్త కమిషనరేట్లు.. ఐపీఎస్ల బదిలీలు

HYDలో కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్, సైబరాబాద్తో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ(రాచకొండ స్థానంలో), మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. దీంతో పలువురు IPSలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. HYD ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు(ఫొటోలో), మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా ఎం.రమేశ్, యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ను నియమించింది.


